• +91-7023509999
  • 0294-6622222
  • info@narayanseva.org
no-banner

శస్త్రచికిత్స తర్వాత నందిని సంతోషంగా ఉంది.

Start Chat

విజయ కధ : నందిని

పుట్టిన 3 సంవత్సరాల తరువాత, ఆమె ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడం వల్ల సమీపంలోని ఆసుపత్రిలో చేరింది, అక్కడ చికిత్స సమయంలో, ఇంజెక్షన్ యొక్క దుష్ప్రభావాల కారణంగా ఆమె పోలియో బాధితురాలు అయ్యింది.

రాజస్థాన్‌లోని సికార్ జిల్లాలోని దాతారంగఢ్‌ నివాసి అయిన రాజు-సంతోష్ కుమావత్ కుమార్తె నందీనీకి ఇప్పుడు 11 ఏళ్లు. ఎడమ కాలు మోకాలి మరియు బొటనవేలు నుండి  మెలితిప్పినట్లుగా ఉంది. కుటుంబ పేదరికం కారణంగా బాలికకు చికిత్సని అందించలేకపోయారు. తండ్రి రాజూ టైల్స్ వేసే పని చేస్తూ కుటుంబ పోషణ సాగిస్తున్నాడు. కూతురు కుంటిగా నడవడం చూసి ఆ కుటుంబం కూడా కలత చెందింది. నందీని కూడా పాఠశాలకు వెళ్ళడానికి ఇబ్బందులు ఎదుర్కొంది.

ఇంతలో, Narayan Seva Sansthanలో ఉచిత పోలియో చికిత్స గురించి తండ్రి టీవీ ద్వారా తెలుసుకున్నప్పుడు, అతను వెంటనే తన కుమార్తెను 22 మార్చి 2023 న ఉదయపూర్‌ సంస్ధకి తీసుకువెళ్ళాడు. సంస్ధలో ఎడమ కాలిని పరిశీలించిన తరువాత, మార్చి 25 మరియు ఆగస్టు 11 వరుసగా రెండు శాస్త్రచికిత్సలు చేశారు. దాదాపు 13 సందర్శనల తరువాత, నందిని ఇప్పుడు తన పాదాలపై నిలబడటమే కాకుండా నడవగలదు మరియు పరుగెత్తడం కూడా చేయగలదు. కూతురు సులువుగా నడవడం చూసి కుటుంబ సభ్యులు సంతోషిస్తున్నారు.

చాట్ ప్రారంభించండి